వాట్సప్ గ్రూపుల్లో గ్రంథాలయం ట్రైలర్ వైరల్
వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో ఎస్. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ “గ్రంథాలయం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో రీసెంట్ గా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆద్యంతం వరకు సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ను కట్ చేసారు.
“మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునే కథ కాదు నాది” లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫైట్స్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండబోతుంది అని ట్రైలర్ లో అర్ధమవుతుంది.
ప్రస్తుతం గ్రంథాలయం చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ట్రైలర్ డిస్టుబ్యూటర్స్ వాట్సాప్ లలో వైరల్ గా మారింది. ట్రేడు వర్గాల్లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది.అన్ని పనులని పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చ్ 3న రిలీజ్ కి సిద్దమవుతుంది.